ఏప్రిల్ 03న నామినేషన్ దాఖలు చేయనున్న రాహుల్ గాంధీ

-

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏప్రిల్ 3న కేరళలోని వాయనాడ్ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అదే రోజున నామినేషన్ దాఖలుతో పాటు పెద్ద ఎత్తున రోడ్ షో నిర్వహిస్తారని తెలిపాయి. 3వ తేదీ మొత్తం ప్రచారం నిర్వహించనున్నారు. రోడ్ షో కోసం కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రండ్  2019 నాటి తరహాలో ప్రధాన కార్యక్రమంగా భారీ ఎత్తున నిర్వహించాలని భావిస్తోంది. కేరళ నుంచి రాహుల్ అభ్యర్థిత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం చూపుతుందని, కేరళలోని మిగతా 19 స్థానాల్లో యూడీఎఫ్ అభ్యర్థులకు ప్రయోజనం చేకూరుతుందని కాంగ్రెస్ శిబిరాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

2019లో కేరళలోని 20 స్థానాలకు గానూ యూడీఎఫ్ 19 స్థానాలను గెలుచుకున్న సంగతి తెలిసిందే. అప్పట్లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని, రాహుల్ ప్రధాని అవుతారనే భావనా బలంగా ఉండేది. బీజేపీ సైతం ఇదే అభిప్రాయాన్ని కలిగి ఉండేది. అయితే, ఈసారి అలాంటి పరిస్థితులు కనిపించడంలేదు. ఈ ఎన్నికల కోసం బీజేపీ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రను రంగంలో దింపి గట్టి పోటీ ఇవ్వాలని చూస్తోంది. 2019లో రాహుల్ వాయనాడ్లో 4.3 లక్షల కంటే ఎక్కువ ఓట్ల తేడాతో విజయం సాధించారు. వామపక్షాలు సీపీఐ జాతీయ నాయకుడు అన్నీ రాజాను రంగంలోకి దింపడంతో బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news