తెలుగు రాష్ట్రాల ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్..!

-

ఏపీ తెలంగాణ ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా విజృంభణ నేపథ్యంలో రెండు రాష్ట్రాలలో దాదాపు పన్నెండు ప్యాసింజర్ రైళ్ల సేవలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. కాగా ఆయా రైళ్ళ సేవలను పునరుద్ధరిస్తున్నట్టు రైల్వే స్పష్టం చేసింది. అంతే కాకుండా ఇకపై ఇవి అన్ రిజర్వుడ్ ఎక్స్ప్రెస్ లుగా నడుస్తాయని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా ఓ చేదు వార్తను కూడా దక్షిణ మధ్య రైల్వే వినిపించింది. టికెట్ చార్జీలు పెరగడంతోపాటు ఈ 12 రైళ్ల హాల్టింగ్ స్టేషన్ల సంఖ్య కూడా తగ్గుతుందని స్పష్టం చేసింది.

ఎక్స్ప్రెస్ రైళ్లు గా మారిన ప్యాసింజర్లు ఇవే..

తెనాలి-రేపల్లె-తెనాలి (07873/07874), రేపల్లె-తెనాలి-రేపల్లె (07875/07876). ఇది ఈ నెల 13 నుంచి అందుబాటులోకి వస్తుంది. మిర్యాలగూడ-నడికుడి-మిర్యాలగూడ (07277/07273). ఈ మెమూ రైలు ఈ నెల 11 నుంచి అందుబాటులోకి వస్తుంది. నర్సాపూర్-విజయవాడ-నర్సాపూర్ (07044/07045). ఈ డెమూ రైలు 14 నుంచి పట్టాలపైకి వస్తుంది. కాచిగూడ-రొటెగాం-కాచిగూడ (07571/07572) ఈ నెల 15 నుంచి అందుబాటులోకి వస్తుంది. కాచిగూడ-మిర్యాలగూడ-కాచిగూడ (07276/07974). ఇది ఈ నెల 11 నుంచి సేవలు ప్రారంభిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news