రైల్వే ట్రాక్ పై కారు బీభత్సం.. పీకలదాకా తాగి మహిళ రచ్చ !

-

ఈ మధ్యకాలంలో జనాలు ఏం చేస్తున్నారో వాళ్లకే తెలియడం లేదు. పీకలదాకా తాగి రోడ్లపై పడుకోవడం.. లేదా కరెంటు పోల్ ఎక్కి రచ్చ చేయడం లాంటివి చేస్తున్నారు. పండుగలు లేదా కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా బాగా తాగి జనాలు రచ్చ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

Railway track turned road Woman’s drive sparks panic near Shankarpally
Railway track turned road Woman’s drive sparks panic near Shankarpally

ఇందులో మగాళ్ళే కాకుండా మహిళలు కూడా రెచ్చిపోతున్నారు. అయితే తాజాగా ఓ మహిళ.. పీకలదాకా తాగి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. బాగా తాగి రైల్వే పట్టాలపైనే కారు నడిపింది. ఎవరు ఆపమన్నా… ఆపకుండా రైలుకు ఎదురుగా కారు నడుపుకుంటూ వెళ్ళింది.

ఈ సంఘటన హైదరాబాద్ పరిధిలోని శంకర్ పల్లి లో చోటుచేసుకుంది. అయితే ఆ కారు రైలు పట్టాలపై దాదాపు పది కిలోమీటర్ల పాటు నడిచినట్టు తెలుస్తోంది. ఆ సమయంలో బెంగళూరు – హైదరాబాద్ ట్రైన్ ఎదురుగా వచ్చినట్లు చెబుతున్నారు స్థానికులు. అయితే స్థానికులు వెంటనే అప్రమత్తమై ఆ కారును ఆపి ఆమెను పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన వీడియో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news