తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన …మత్స్య కారులు హెచ్చరిక..!

-

తెలుగు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బ౦గాళాఖాతంలో ఉత్తరాంధ్ర , దక్షిణ ఒడిషా తీరం మధ్య అల్పపీడనం కొనసాగుతుంది. దాని ప్రభావం తో ఒడిషా మరియు రెండు తెలుగు రాష్ట్రాలలో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అంతే కాకుండా వర్షాల నేపథ్యం లో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మొదటి నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. తరచూ వర్షాలతో హైదరాబాద్ ప్రజలు కూడా ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. వర్షాలతో ట్రాఫిక్ జామ్ లు లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరటం తో ఆందోళన చెందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news