IPL 2022 : క్రికెట్‌ ఫ్యాన్స్‌ కు గుడ్‌ న్యూస్..ఐపీఎల్‌ లోకి రైనా రీ ఎంట్రీ !

-

ఐపీఎల్ – 2022 మార్చి 26 నుంచి ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ ఏడాది కొత్తగా గుజ‌రాత్ తో పాటు ల‌క్నో రెండు ఫ్రొంచైజీలు ఆడ‌బోతున్నాయి. ఇప్ప‌టికే జ‌రిగిన మెగా వేలంలోనూ ఈ రెండు కొత్త ప్రొంఛైజీలు నాణ్య‌మైన ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేశాయి. అయితే.. ఐపీఎల్ ప్రారంభానికి ముందు కొత్త జ‌ట్టు గుజరాత్ టైటాన్స్ పెద్ద ఎదురు దెబ్బ త‌గిలింది.

ఇటీవ‌ల జ‌రిగిన మెగా వేలంలో కొనుగోలు చేసిన విధ్వంస‌క‌ర ఓపెన‌ర్ ఇంగ్లాండ్ స్టార్ ఆట‌గాడు జేస‌న్ రాయ్.. ఐపీఎల్ – 2022కు పూర్తి దూరంగా ఉంటున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. బ‌యో బ‌బుల్ ఒత్తిడి ఎక్క‌వు ఉంద‌నే కార‌ణంతోనే తాను ఐపీఎల్ – 2022 కు దూరంగా ఉంటున్న‌ట్టు ప్ర‌క‌టించాడు.

అయితే.. జేసర్‌ రాయ్‌ స్థానంలో.. ఐపీఎల్‌ వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయని ప్లేయర్‌ రైనాను తీసుకునేందుకు గుజరాత్‌ టైటాన్స్‌ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. రూ.2 కోట్లతో సురేష్‌ రైనాను తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోషల్‌ మీడియా సురేష్‌ రైనా ఫ్యాన్స్‌ కామెంట్లు కూడా పెడుతున్నారు. జేసన్‌ రాయ్‌ స్థానంలో సురేష్‌ రైనా రీ ఎంట్రీ ఇస్తున్నట్లు కామెంట్స్‌ పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news