నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారం..!

-

కాకినాడ: ఇంట్లో పడుకున్న చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లి అత్యాచారానికి ఓడిగట్టాడు. దారుణంగా హింసించి నరకం చూపించాడు. ఇంతటి దారుణ ఘటన తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల సహాయంతో చిన్నారిని ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు స్పందించడం లేని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

child rape cases
child rape cases

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడ నగరానికి చెందిన బాలిక తన అమ్మమ్మ, తాతయ్య, తండ్రితో కలిసి ఉంటోంది. బాలిక తల్లి ఉపాధి నిమిత్తం హైదరాబాద్ వెళ్లింది. దీంతో చిన్నారి తన అమ్మమ్మ వాళ్ల ఇంట్లోనే ఉంటోంది. అయితే రోజులాగే బుధవారం రాత్రి తన అమ్మమ్మ దగ్గర పడుకుంది. నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని ఓ వ్యక్తి ఇంట్లో చొరబడి బాలికను బయటకు ఎత్తుకెళ్లాడు.

చిన్నారి అరవకుండా ఉండేందుకు దారిపొడవునా కొడుతూ తీసుకెళ్లాడు. ఊరి చివర ఉన్న శ్మశాన వాటిక దగ్గరికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. దీంతో చిన్నారికి తీవ్ర రక్తస్రావమై స్పృహ కోల్పోయింది. ఒంటి మీద దుస్తులేకుండా వివస్త్రను చేసి అక్కడే వదిలేసి ఆ కామాంధుడు పరారయ్యాడు. తెల్లవారుజామున అటు వైపుగా వెళ్తున్న ఓ వ్యక్తి బాలికను గుర్తించాడు.

బాలిక కనిపించడం లేదని ఆందోళన చెందుతున్న అమ్మమ్మకు ఆ వ్యక్తి చిన్నారిని అప్పగించాడు. గాయాలతో ఉన్న చిన్నారిని కుటుంబసభ్యులు కాకినాడలోని జీజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స కోసం మెడికో లీగల్ కేసు (ఎంఎల్ సీ) తీసుకురావాలని వైద్యులు చెప్పడంతో చిన్నారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఈ మేరకు ఉదయం 10 గంటలకు సీఐ రామ్మోహన్ చొరవ తీసుకుని చికిత్స ప్రారంభించమని వైద్యులకు సూచించారు.

ఈ విషయం జీజీ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాఘవేంద్రరావును వివరణ కోరగా.. ఆ సమయంలో పిల్లల వైద్యుడు, మత్తు వైద్యుడు వేరే శస్త్ర చికిత్సలో ఉన్నారని, అందుకే కొంత జాప్యం నెలకొందని అన్నారు. చిన్నారికి మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కాకినాడ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని వీలైనంత త్వరగా అరెస్ట్ చేస్తామని, దీని కోసం స్పెషల్ టీంను ఏర్పాటు చేశామని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news