తెలంగాణ రైతులకు శుభవార్త..10 రోజుల్లోనే ‘రైతుబంధు’ నిధులు!

-

తెలంగాణ రైతులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. యాసంగి సీజన్ పంటల సాగు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతు బంధు నిధులు పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఎకరానికి 5 వేల రూపాయల చొప్పున సుమారు కోటిన్నర లక్షల ఎకరాలకు ఏకంగా 7,500 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం అందుతోంది.

kcr
kcr

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిధుల సర్దుబాటుపై ఆర్థిక శాఖ ఇప్పటికే దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు … నిన్న టీఆర్ఎస్ ఎంపీలతో జరిగిన సమావేశంలో… సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని కూడా గుర్తు చేసినట్లు సమాచారం అందుతోంది. డిసెంబర్ 15వ తేదీ అంటే మరో పది రోజుల్లోనే… తెలంగాణ రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ కావాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించినట్లు సమాచారం అందుతోంది. అలాగే టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో… తెలంగాణ రాష్ట్ర రైతుల తరపున తమ గొంతును గట్టిగా వినిపించాలని .. దిశానిర్దేశం చేశారు సీఎం కేసీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news