యూపీలో ఉండాలంటే యోగీకి ఓటేయ్యాల్సిందే… యూపీ ఓటర్లకు రాజాసింగ్ వార్నింగ్

-

యూపీలో ఉండాలంటే.. యోగీకి జైకోట్టాల్సిందే అని, యూపీలో ఉండాలంటే యోగీ ఆదిత్య నాథ్కు ఓటేయాల్సిందే అని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ యూపీ ఓటర్లకు వార్నింగ్ ఇచ్చారు. ఎవరైతే బీజేపీకి ఓటేయకుంటే.. వారికి ఒకటే చెప్పదలుచుకున్నా.. జేసీబీ, బుల్డోజర్ తెప్పించాల్సి ఉంటుందని.. ఎవరి కోసం వీటిని తెప్పిస్తామో అందరికి తెలిసే ఉంటుందని ఆయన అన్నారు. ఎన్నికల తర్వాత ఎవరైతే యోగీకి ఓటు వేయరో వారి ఏరియాల్లో గుర్తిస్తామని అన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో ఉండాలంటే.. యోగీ అనాల్సిందే అని వార్నింగ్ ఇచ్చారు. ఓటు వేయకుంటే ఉత్తర్ ప్రదేశ్ నుంచి వెళ్లిపోవాల్సిందే అంటూ హెచ్చరించారు.

ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్ లో రెండో విడత పోలింగ్ ముగిసింది. ప్రస్తుతం యూపీలో ఎస్పీ, బీజేపీ మధ్య తీవ్ర పోటీ ఉంది. ఈ రెండు పార్టీలు నువ్వా నేనా అన్నరీతిలో పోరు సాగిస్తున్నాయి. అయితే సర్వేలు మాత్రం సీట్లు తగ్గినా.. బీజేపీ అధికారంలోకి వస్తుందంటూ జోస్యం చెబుతున్నాయి. ఇదిలా ఉంటే ఎన్డీయేతర విపక్షాలు మాత్రం ఎస్పీ గెలుస్తుందని.. అఖిలేష్ సీఎం అవుతాడంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news