టిఆర్ఎస్ పార్టీని బొంద పెట్టడానికే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు – ఎంపీ అరవింద్

-

టిఆర్ఎస్ పార్టీ నీ బొంద పెట్టడానికే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని అన్నారు బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చౌటుప్పల్ మున్సిపాలిటీలో బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో విద్య, వైద్య, వ్యవసాయ రంగాలను బ్రష్టు పట్టించారని మండిపడ్డారు. ధరణి పోర్టల్ పేరుతో రైతులను ఆగం చేశారని అన్నారు.

కెసిఆర్ హిట్లర్ లాగా పాలన చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మోడీ నాయకత్వాన్ని బలపరచడానికి మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ని గెలిపించాలని కోరారు. అలాగే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం షాపులు పెట్టి ప్రజలను ఆగం చేస్తున్నారని మండిపడ్డారు. టిఆర్ఎస్ ఎనిమిదేళ్ల పాలనలో ప్రజల బతుకులు ఏమీ మారలేదని మండిపడ్డారు. సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల లాగా మిగతా నియోజకవర్గాలను ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. టిఆర్ఎస్ డబ్బులు తీసుకుని బిజెపికి ఓటు వేయాలి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news