IPL 2024: బట్లర్ సెంచరీ… కేకేఆర్ పై రాజస్థాన్ గ్రాండ్ విక్టరీ

-

ఐపీఎల్ 2024 టోర్నమెంట్ లో భాగంగా నిన్న 31 వ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ అండ్ వికెట్ల తేడాతో ఉత్కంఠ పోరులో విజయం సాధించింది. కేకేఆర్ మొదట బ్యాటింగ్ చేసి ఆరు వికెట్లు నష్టపోయి 223 పరుగులు చేసింది.

Rajasthan Royals won by 2 wkts

అయితే ఆ లక్ష్యాన్ని రాజస్థాన్ ఎంతో కష్టపడి చేదించగలిగింది. ఎనిమిది వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని అందుకుంది రాజస్థాన్ రాయల్స్. రాజస్థాన్ బ్యాటర్లలో జోష్ బట్లర్ అద్భుతమైన సెంచరీతో రాణించాడు. అతనికి రియాన్ పరాగ్ అలాగే పోవెల్ సహాయ సహకారాలు అందించడంతో రాజస్థాన్ విజయం సాధించగలిగింది. అటు సునీల్ నరేన్ సెంచరీ చేసినప్పటికీ కేకేఆర్ మాత్రం విజయం సాధించలేదు.

Read more RELATED
Recommended to you

Latest news