ఈరోజు హైదరాబాద్ లో వైన్స్ బంద్

-

శ్రీ రామ నవమి సందర్భంగా హైదరాబాద్ లో ఘనంగా వేడుకలు జరపనున్నారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలో శ్రీ రామ శోభా యాత్ర నిర్వహించనున్నారు. ఈ క్రమంలో పోలీసు అధికారులు మందు బాబులకు బిగ్‌ షాక్ ఇచ్చారు. ఇవాళ నగరంలోని వైన్ షాప్ అన్ని బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Wines bandh in Hyderabad today

ఈ నేపథ్యంలో నగరంలోని వైన్ షాపులన్నీ ఇవాళ ముసుకున్నాయి. ఈరోజు  ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు వైన్, కల్లు, దుకాణాలు, రెస్టారెంట్లలోని బార్లు సైతం బంద్ చేయాలని నగర సీపీ శ్రీనివాస్ స్పష్టం చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో శాంతి భద్రతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహించనున్నట్టు సమాచారం. మరోవైపు శోభా యాత్ర సందర్భంగా నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ మల్లింపులు ఉన్నట్లు సీపీ శ్రీనివాస్ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news