ఐపీఎల్: చితకబాదిన పంజాబ్.. రాజస్థాన్ లక్ష్యం 222పరుగులు ..

-

ఐపీఎల్ లో నాలుగవ జరుగుతున్న మ్యాచులో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్తాన్ రాయల్స్ పై బ్యాట్ తో విరుచుకుపడిందని చెప్పవచ్చు. కేఎల్ రాహుల్, దీపక్ హుడా, క్రిస్ గేల్ మంచి ఫామ్ లో ఉండడంతో పంజాబ్ స్కోరు 200దాటింది. పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ వీరోచిత ఇన్నింగ్స్ తో మెరిసి 91పరుగులు చేసాడు. అటు రాహుల్ కి దీపక్ హుడా, క్రిస్ గేల్ తమ వంతు సహకారం అందించారు. దీపక్ హుడా అర్థ సెంచరీ పూర్తి చేసుకోవడంతో జట్టు స్కోరు 20ఓవర్లు ముగిసే సమయానికి 6వికెట్లు కోల్పోయి 221పరుగులు చేసింది.

స్కోరు బోర్డు విషయానికి వస్తే, కేఎల్ రాహుల్ 91పరుగులు (50బంతుల్లో 7ఫోర్లు, 5సిక్సర్లు), క్రిస్ గేల్ 40పరుగులు (28బంతుల్లో 4ఫోర్లు, 2పరుగులు), దీపక్ హుడా 64పరుగులు (28బంతుల్లో 4ఫోర్లు, 6సిక్సర్లు) చేసారు. రాజస్తాన్ బౌలర్లలో చేతన్ సకారియా మూడు వికెట్లు, క్రిస్ మోరిస్ రెండు వికెట్లు, రియన్ పరాగ్ ఒక వికెట్ తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news