ఐపీఎల్: సాంసన్ శ్రమించినా విజయం దక్కలేదు..

-

ఐపీఎల్ నాలుగవ మ్యాచులో రాజస్తాన్ రాయల్స్ పై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అద్భుత విజయాన్ని అందుకుంది. 222పరుగుల భారీ లక్ష్య ఛేధనలో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ జట్టు పోరాడి పోరాడి నాలుగు పరుగుల తేడాతో అపజయాన్ని మూటగట్టుకుంది. రాజస్తాన్ కెప్టెన్ సంజూ సాంసన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడడంతో భారీ స్కోరు అయినప్పటికీ చివరి వరకూ లాక్కు వచ్చారు. చివరి బంతికి ఐదు పరుగులు రావాల్సి ఉండగా సిక్సర్ బాదబోయిన సాంసన్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 20ఓవర్లు ఆడిన రాజస్తాన్ జట్టు ఏడు వికెట్లు కోల్పోయి 217పరుగులు మాత్రమే చేయగలిగింది.

సెంచరీ చేసిన సాంసన్ రాజస్తాన్ కి విజయాన్ని అందించలేకపోయాడు. రాజస్తాన్ బ్యాట్స్ మెన్లలో సంజూ సాంసన్ 119పరుగులు (63బంతుల్లో 12ఫోర్లు, 7సిక్సర్లు), జోస్ బట్లర్ 25పరుగులు (13బంతుల్లో 5ఫోర్లు), రియమ్ పరాగ్ 25పరుగులు (11బంతుల్లో 1ఫోర్, 3సిక్సర్లు) చేసారు. పంజాబ్ బౌలర్లలో షమి, రిచర్డ్ సన్, మురుగన్ అశ్విన్ తలా రెండు వికెట్లు తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news