సీరియల్స్ కు షాక్ ఇచ్చిన రజినీకాంత్ …!

-

సూపర్ స్టార్ రజనీకాంత్ ఎక్కడైనా సరే తను సూపర్ స్టార్ నే అని నిరూపించుకున్నారు. వేదిక ఏదైనా సరే తనకంటూ ఒక ప్రత్యేక చాటుకుంటారు రజనీ కాంత్. ప్రస్తుతం శివ దర్శకత్వంలో ‘అన్నాత్త’ అనే సినిమాలో నటిస్తున్నారు రజనీ కాంత్. ఈ చిత్రంలో ఖుష్బూ, మీనా, నయనతార, కీర్తి సురేష్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. సినిమా పనుల్లో బిజీగా ఉన్నప్పటకీ కూడా రజనీకాంత్ తాజాగా బేర్ గ్రిల్స్ తో కలిసి చేసిన ఒక రియాలిటీ షో సూపర్ హిట్ అయింది.

ఈ ప్రోగ్రామ్‌కు డిస్కవరి చానెల్‌లో 12 భాషల్లో ప్రసారం అయింది. ఈ ప్రోగ్రామ్ మార్చి నెల 23 న రాత్రి 8 గంటలకు డిస్కవరి చానెల్‌లో ప్రసారమైంది. ఈ రియాలిటీ షో ఈ యేడాదిలోనే అత్యధిక రేటింగ్ సాధించిన రియాలిటీ షోగా అంతే కాకుండా అత్యధిక రేటింగ్ సాధించిన ప్రోగ్రామ్‌గా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ రియాలిటీ షో వివరాలు కనుక చూస్తే మన సూపర్ స్టార్ రజనీకాంత్ బేర్ గ్రిల్స్‌తో కలిసి ‘ఇన్ టూది వైల్డ్ విత్ బియర్ గ్రిల్స్’ అనే ప్రోగ్రాం ఒకటి చేశారు.

కర్ణాటకలోని బందీపురా టైగర్ రిజర్వ ఫారెస్ట్‌లో ఈ ప్రోగ్రామ్ కు సంబంధించిన షూటింగ్ జరిగింది. ఈ ప్రోగ్రామ్ చేసే సమయంలో రజినీకాంత్ కు గాయాలు అయ్యాయి. తమిళనాడులో ఎక్కువ మంది ఈ ప్రోగ్రామ్ చూసారు. బార్క్ ఇండియా లెక్క ప్రకారం సుమారు 12.4 మిలియన్ల మంది ఈ ప్రోగ్రామ్‌ను చూసారు. టీవీలో ఈ కార్యక్రమం ప్రచారమైన టైమ్ లో వేరే మిగతా వాటి రేటింగ్స్ పూర్తిగా పడిపోయాయి. ఈ షో ప్రచారమైనన్ని రోజులు అన్ని ఛానెల్స్ లోని హిట్ సీరియల్స్ ఆదరణ కోల్పోయాయి. ఇక్కడ కూడా రజనీ తన మానియా కనబరిచారు.

Read more RELATED
Recommended to you

Latest news