వాళ్లిద్దరూ ఆడుతున్నప్పుడు కొంచెం టెన్షన్ పడ్డాను… కానీ మనోళ్లే కొట్టేశారు: రజినీకాంత్

-

నిన్న ముంబై లో ఇండియా న్యూజిలాండ్ ల మధ్యం జరిగిన సెమి ఫైనల్ మ్యాచ్ కు చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు. అలాంటి వారిలో ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యామిలీ తో పాటు వచ్చి మ్యాచ్ ను తిలకించారు. మ్యాచ్ అనంతరం రజినీకాంత్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ మ్యాచ్ గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. రజిని మాట్లాడుతూ.. ఛేజింగ్ సమయంలో విలియమ్సన్ మరియు మిచెల్ లు అద్భుతంగా అధిక భాగస్వామ్యం చేసి ఆడుతున్నప్పుడు కాస్త టెన్షన్ పడ్డానని చెప్పుకొచ్చారు. కానీ ఆ తర్వాత ఇండియా బౌలర్లు పుంజుకుని కివీస్ ను ఆల్ అవుట్ చేయడం మరిచిపోలేని అంశం అని పొగడతలతో ముంచెత్తాడు రజినీకాంత్. ముఖ్యంగా షమీ ఏకంగా 7 వికెట్లను తీసి కివీస్ ను కోలుకోలేని దెబ్బ కొట్టడంతో రజిని సంతోషంగా చెప్పారు.

ఇదే ఊపుతో ఇండియా ఫైనల్ లోనూ ఆడితే కప్ మనదే అవుతుంది అంటూ రజిని ఫైనల్ కు ముందే ఆల్ ది బెస్ట్ చెప్పాడు. మరి రజినీకాంత్ కోరుకున్న విధంగా ఇండియా ఫైనల్ లోనూ తమ ప్రత్యర్థిని ఓడించి కప్ ను గెలుస్తుంది అని ఆశిద్దాం.

Read more RELATED
Recommended to you

Latest news