రజనీకాంత్ ఒకటి తలిస్తే మరోకటి జరిగిందా

-

అదేమిటోగానీ.. రజనీకాంత్‌ ఒకటనుకుంటే మరోటి జరుగుతోంది. ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘అన్నాత్తే’ను ఎలక్షన్స్‌కు ముందే రిలీజ్ చేయాలన్న పట్టుదలతో షూటింగ్‌ మొదలుపెట్టాడు. సినిమా మొదలై వారంకాకుండానే.. ఆగిపోయింది. కరోనా మహమ్మారి అన్నాత్తేని అడ్డుకుంది.

శివ దర్శకత్వంలో రజనీకాంత్‌ నటిస్తున్న అన్నాత్తే సంక్రాంతికి రిలీజ్‌ కావాల్సివుండగా.. కరోనా బ్రేకులేసింది. త్వరలో రాజకీయపార్టీ ప్రకటిస్తానని చెప్పిన రజనీకాంత్‌ పొలిటికల్‌ ఎంట్రీకి అన్నాత్తే ఉపయోగపడుతుందనుకున్నాడు. ముందు సినిమా షూటింగ్‌ పూర్తిచేయాలనుకుని.. హైదరాబాద్‌లో 45 రోజుల షెడ్యూల్‌ ప్లాన్‌ చేశారు. వారంరోజులపాటు షూటింగ్ సాఫీగా సాగింది. ఇంతలో చిత్ర యూనిట్‌లో ఏడుగురుకు కరోనా పాజిటివ్‌ అని తేలడంతో షూటింగ్‌ ఆపేశారు.

చిత్ర యూనిట్‌లో ఏడుగురికి కరోనా సోకడంతో.. రజనీకాంత్‌ సెల్ఫ్‌ కోరంటైన్‌లోకి వెళ్లిపోయారట. ఈలెక్కన షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేకులు పడినట్టే. ఖుష్బూ.. మీనా.. కీర్తిసురేష్‌ ..జాకీ ష్రాఫ్‌.. ప్రకాష్‌రాజ్‌ వంటి భారీ తారాగణం నటించడంతో.. అందరి డేట్స్ కదరడం అంత ఈజీ కాదు. దీంతో తమిళనాడు ఎలక్షన్స్‌కు ముందే అన్నాత్తే వస్తుందా? అన్న డౌట్‌ ఫ్యాన్స్‌లో మొదలైంది.

Read more RELATED
Recommended to you

Latest news