షాకింగ్; టీడీపీ నేతకు రాజ్యసభ హామీ ఇచ్చిన జగన్…!

-

ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికల సందడి నెలకొంది. అధికార వైసీపీ నాలుగు స్థానాలను వచ్చే నెల కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. వచ్చే నెల నాలుగు స్థానాలు, తోట సీతారామ లక్ష్మి, కే కేశవరావు, సుబ్బిరామి రెడ్డి, గరికపాటి మోహన్ రావు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. దీనితో అధికార పార్టీ నుంచి ఎవరిని పంపిస్తారు అనేది చెప్పలేని పరిస్థితి. ఇంకా ఎన్నికలకు సరిగా నెల రోజులు ఉంది.

ఈ నెల రోజుల్లో జగన్ ఎవరికి ఆ అవకాశం ఇస్తారు అనేది చెప్పలేని పరిస్థితి. ముఖ్యంగా అయోధ్య రామిరెడ్డి, షర్మిల, చిరంజీవి, బీద మస్తాన్ రావు పేర్లు ఇప్పుడు ఎక్కువగా వినపడుతున్నాయి. ఇక జాస్తి చలమేశ్వర్ కి కూడా ఆ అవకాశం ఇచ్చే సూచనలు ఉన్నాయి అనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. జాస్తి కి చంద్రబాబుకి మధ్య అనుబంధం ఉంది. వాళ్ళు పైకి కనపడని స్నేహితులు కూడా.

ఇక ఇప్పుడు మరో టీడీపీ నేతకు జగన్ ఈ హామీ ఇచ్చారని అంటున్నారు. రాయలసీమలో బలమైన నేతకు జగన్ ఈ స్పష్టమైన హామీ ఇచ్చినట్టు సమాచారం. గత ఎన్నికల్లో ఆయన కర్నూలు జిల్లా నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కాని ఆయన కేడర్ చాలా బలంగా ఉంది. గతంలో కేంద్ర మంత్రిగా కూడా పని చేసారు. జగన్ సామాజిక వర్గం. ఆయనకు రాజ్యసభ ఇస్తే మూడు నుంచి ఆరు నియోజకవర్గాల్లో పార్టీ బలపడుతుంది.

రాజకీయంగా కూడా ఆయనకు అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఏ నిర్ణయం తీసుకుంటారు జగన్ అనేది చెప్పలేని పరిస్థితి. ఆయన్ను గనుక రాజ్యసభకు పంపిస్తే మాత్రం టీడీపీ బలమైన నేతను కోల్పోయే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. దీనితో కేడర్ కూడా ఆయన వెంట నడవడం ఖాయం అనేది టీడీపీ నేతల మాట కూడా. కాబట్టి జగన్ ఆయన విషయంలో ముందుకి వెళ్ళే అవకాశాలే ఉన్నాయని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news