‘ఆచార్య’ కోసం రామ్ చరణ్ భారీ ప్లాన్..2వేల స్క్రీన్లలో మూవీ రిలీజ్

-

టాలీవుడ్‌ అగ్ర హీరో, మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న తాజా మూవీ ఆచార్య. ఈ ఆచార్య సినిమాకు టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా… మరో జంటగా రామ్ చరణ్ అలాగే పూజా హెగ్డే నటిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమాను భారీ బడ్జెట్ తో చేస్తున్నారు.

ఈ సినిమాకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించడం గమనార్హం. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ మూవీని పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ చేయనున్నట్లుగా వార్తలు వచ్చాయి.

అందులో నిజం లేదనేది తాజాగా వచ్చిన సమాచారం. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లోనే భారీ స్థాయిలో రిలీజ్‌ చేయనున్నారని టాక్‌ వినిపిస్తోంది. దాదాపు 1500 నుంచి 2000 స్క్రీన్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం అందుతోంది. కాగా.. ఆచార్య మూవీ ఈ నెల 29 వ తేదీన విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news