BREAKING : ముఖ్యమంత్రి జగన్‌తో రామోజీ రావు కుమారుడు భేటీ

-

అమరావతి : ఆంధ ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డితో రామోజీ రావు కుమారుడు, ఈనాడు ఎండీ కిరణ్ భేటీ అయ్యారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో వీరి సమావేశం జరుగుతోంది. తన కుమార్తె వివాహ వేడుకకు ఆంధ ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డిని ఈ సందర్భంగా కిరణ్ ఆహ్వానించారు. అలాగే ప్రస్తుతం ఏపీ రాజకీయాలపై వీరిద్దరూ చర్చించినట్లు సమాచారం అందుతోంది.

కాగా.. ఈనాడు మీడియా సంస్థ.. ఎప్పుడూ.. జగన్‌ మోహన్‌ రెడ్డి, ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగానే.. వ్యవహరిస్తూ ఉంటుందన్న సంగతి తెలిసిందే. అలాగే.. ఈనాడు అధినేత… రామోజీరావు ను కూడా జగన్‌ మోహన్‌ రెడ్డి… బహింరంగానే విమర్శిస్తూ ఉంటారు. ఎల్లో మీడియా అంటూ.. ప్రతి ఒక్క వైసీపీ నేత వారిని టార్గెట్‌ చేస్తారు. కానీ.. అవన్నీ రాజకీయాల వరకే జరుగుతుంటాయి. ఏదైనా శుభాకార్యలు జరిగితే.. ఇలాంటి ఆహ్వానాలు కూడా ఇచ్చుకుంటానే ఉంటారు.

 

Read more RELATED
Recommended to you

Latest news