నవంబర్ 10 లోపు బిజేపిలోకి రాములమ్మ…?

-

గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీలో సైలెంట్ గా ఉంటున్న సినీ నటి విజయశాంతి బిజెపిలో చేరే అవకాశం ఉండవచ్చు. నిన్న సాయంత్రం ఆమె అనూహ్యంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తో సమావేశం అయ్యారు. అక్కడి నుంచి ఆమె పార్టీలో చేరే ముహూర్తంపై బిజేపిలో చర్ఛ జరుగుతుంది. బిజేపిలో చేరాల్సిందిగా ఆహ్వానించేందుకే కిషన్ రెడ్డి విజయశాంతి నివాసానికి వెళ్లారని బిజేపి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

నవంబర్ 10 లోపు మంచి ముహూర్తం చూసుకుని బిజేపిలో చేరేందుకు అంగీకారం తెలిపారని బిజెపి రాష్ట్ర నాయకత్వం అంటుంది. బిజెపి అగ్ర నేతల సమక్షంలో బీజేపీలో చేరికకు ఏర్పాట్లు చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఆమెకు రాష్ట్ర స్థాయిలో మంచి పదవి ఇచ్చే అవకాశం ఉండవచ్చు అని భావిస్తున్నారు. దీనిపై త్వరలోనే ఒక స్పష్టత ఇవ్వనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news