అల్లరి నరేష్ వల్లే నా గౌరవం నిలబడింది..ప్రముఖ నటి..!

-

కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గీతా సింగ్ పలు సినిమాలలో నటించి మంచి పేరు సంపాదించింది. మొదట అల్లరి నరేష్ తో నటించిన కితకితలు సినిమాతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన ఈమె చాలాకాలంగా అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నట్లు తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది గీతా సింగ్. అయితే తను కూడా ఎన్నో అవమానాలు ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలియజేస్తోంది.వాటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

గీత సింగ్ మాట్లాడుతూ ఒకప్పుడు హీరోయిన్ గా నటించిన ఈమె ఆ తరువాత వరుస సినిమాలలో క్యారెక్టర్ రోల్స్ నటిస్తూ నటిస్తూ వచ్చిన ఈమె ఇప్పుడు అవకాశాలు లేక కనుమరుగయ్యానని తెలియజేస్తోంది. అయితే ఇందుకు కారణం ఈ మధ్యకాలంలో ఫిమేల్ ఆర్టిస్టులకు పెద్దగా అవకాశాలు లేవని తెలియజేస్తోంది. ముఖ్యంగా పురుషాదిక్యం పెరగడం వల్ల మాలాంటి వారిని అసలు చూడడం లేదని ఆరోపిస్తోంది గీతా సింగ్. ఇక ఇండస్ట్రీలో తనకు జరిగిన ఎన్నో అవమానాలను తాజాగా ఈ ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది. కితకితలు సినిమా చేసిన తర్వాత కమెడియన్ గా ఎన్నో సినిమాలు చేశానని. అయితే ఒకసారి షూటింగ్ జరుగుతున్న సమయంలో ఇద్దరు హీరోయిన్లు తనని చాలా అవమానించారని తనతో దారుణంగా మాట్లాడాలని తెలియజేసింది.

తను కూడా ఒక హీరోయిన్ ఏంటి అని గీతా సింగ్ అవమానించారట. అయితే ఆ సమయంలో అల్లరి నరేష్ తనను పిలిపించి ఆ హీరోయిన్ల ముందే తను నా ఫస్ట్ హీరోయిన్ అంటూ పరిచయం చేశారని దాంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారని తెలియజేసింది. ఇక ఆ తర్వాత తనని మేడం అంటూ గౌరవంగా పిలిచారని తెలియజేసింది గీతా సింగ్. అయితే అల్లరి నరేష్ ఉన్న పొజిషన్లో తను అలా చెప్పాల్సిన తన తోటి హీరోయిన్లతో నటించిన వారి గురించి చెప్పాల్సిన పనిలేదు కానీ ఆయన మంచివారు కాబట్టే అలా అవమానం జరుగుతున్న సమయంలో తన పరువు కాపాడాడు తెలియజేసింది గీతా సింగ్.

Read more RELATED
Recommended to you

Latest news