సంతోషంగా బాలీవుడ్ లవ్ బర్డ్స్.. రణ్‌బీర్, ఆలియా మ్యారేజ్ డేట్ ఫిక్స్..!

-

కొవిడ్ మహమ్మారి వలన మానవ జీవితంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. ఈ క్రమంలోనే కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్ టైంలో సామాన్యులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు తమ వ్యక్తిగత జీవితంపైన కాన్సంట్రేట్ చేశారు. తమలోని కళను బయట పెట్టే ప్రయత్నం చేశారు. అయితే, చాలా మంది సెలబ్రిటీలు పెళ్లి పీటలూ ఎక్కేశారు. ఇందులో ఎక్కువ మంది బాలీవుడ్ వారు ఉండగా, టాలీవుడ్ హీరో హీరోయిన్లు కూడా కొందరు మ్యారేజ్ చేసుకున్నారు. కాగా, బాలీవుడ్ లవ్ బర్డ్స్ గా పేరు గాంచిన రణ్ బీర్ కపూర్, ఆలియా భట్ మ్యారేజ్ గురించి ప్రజెంట్ సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి.

ఈ ఏడాది జనవరిలోనే వీరిరువురి వివాహం జరుగుతుందని వార్తలొచ్చాయి. కానీ, అలా జరగలేదు. ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం వీరి మ్యారేజ్ ఈ ఏడాది ఏప్రిల్ మంత్ లో ఫిక్స్ అయిందని తెలుస్తోంది. బీ టౌన్ లో వీరి మ్యారేజ్ గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. వాటి ప్రకారంగా ఏప్రిల్ నెలలో మ్యారేజ్ సుముహుర్తం ఖరారు అయినట్లు టాక్. బాలీవుడ్ సినీ వర్గాలే కాదు రణ్ బీర్, ఆలియా సన్నిహితులు కూడా ఈ విషయాలను ధ్రువీకరిస్తున్నట్లు వినికిడి.

ఆలియా భట్ కాని రణ్ బీర్ కపూర్ కాని తాము నటించిన చిత్రాల ప్రమోషన్స్ లో డెఫినెట్ గా వారి మ్యారేజ్ గురించిన ప్రశ్నలు మీడియా వారు అడుగుతూనే ఉండటం మనం చూడొచ్చు. ఈ క్రమంలోనే మ్యారేజ్ జరిగితే మాత్రం ఇక అటువంటి ప్రశ్నలకు తావుండదు. ఏప్రిల్ మంత్ లో మ్యారేజ్ ఫిక్స్ అయిన నేపథ్యంలోనే రణ్ బీర్ కపూర్ మదర్ నీతూ కపూర్ మ్యారేజ్ ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

పెళ్లి దుస్తుల కోసం డిజైనర్ మనీశ్ మల్హోత్రను సంప్రదించినట్లు వార్తలూ వస్తున్నాయి. ఇక ‘బ్రహ్మాస్త్ర’ ఫిల్మ్ నుంచి షూటింగ్ బ్రేక్ తీసుకున్న రణ్ బీర్, ఆలియా ఏప్రిల్ మంత్ లోనే మ్యారేజ్ కు ఓకే చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. నిజానికి ఈ ఏడాది అక్టోబర్ లో మ్యారేజ్ అని అనుకున్నారట. కానీ, ఏప్రిల్ మంత్ కు ప్రీ పోన్ చేశారట. అలా మొత్తంగా బాలీవుడ్ లవర్స్ కే కాదు సినీ అభిమానులకు ఆలియా, రణ్ బీర్ లు గుడ్ న్యూస్ చెప్పేశారని సినీ పరిశీలకులు అంటున్నారు. చూడాలి మరి.. ఈ వార్తల్లో నిజమెంతుందో మరి..

 

 

Read more RELATED
Recommended to you

Latest news