ఫేస్ బుక్ హ్యాక్ చేశారు.. ఇన్ స్టాగ్రామ్ డిలీట్ చేశారు : రాణి రుద్రమ

-

రాణి రుద్రమను మంత్రి కేటీఆర్ పై సిరిసిల్లలో బరిలోకి దించింది బీజేపీ. దీంతో అక్కడ ఆమె ప్రచారాన్ని ప్రారంభించారు. తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కొందరు స్థానిక బీజేపీ నేతలు వేరే జిల్లాకు చెందిన రాణి రుద్రమకు ఇక్కడ ఎలా టికెట్ ఇస్తారంటూ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇది ఇలా ఉంటె, రాణి రుద్రమ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తన ఫేస్ బుక్ పేజీ హ్యాక్ అయ్యిందని ఆరోపించారు. హ్యాకింగ్ చేయడం అధికార బీఆర్ఎస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష పార్టీల సోషల్ మీడియా ఖాతాలను బీఆర్ఎస్ పార్టీ హ్యాక్ చేయిస్తోందని ఆరోపించారు.

TS Politics: కేటీఆర్ కుట్రతో నా సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్.. రాణి రుద్రమ  సంచలన ఆరోపణలు - Rtvlive.com

12 ఏళ్లుగా తాను ఫేస్ బుక్ వాడుతున్నానని.. కానీ నిన్న(అక్టోబర్ 30) సాయంత్రం తన ఫేస్ బుక్ ని హ్యాక్ చేసి.. ఇన్ స్టాగ్రామ్ ని డిలీట్ చేశారని.. ఇది ప్రభుత్వ పెద్దల పనే అని మండిపడ్డారు. ఐటీ మంత్రి కేటీఆర్ స్వయంగా ఒక టీమ్ ని స్లీపర్ సెల్స్ గా పెట్టి ఇలా చేపిస్తున్నారని ఆరోపించారు. తాను సిరిసిల్ల నుంచి పోటీ చేస్తున్నానని.. అందుకే కేటీఆర్ భయపడి, ఇలాంటి పనులు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. తాను మీడియాతో మాట్లాడుతుండగానే పేస్ బుక్ లో ఎవరో ఫన్నీ వీడియో పోస్ట్ చేశారని చెప్పారు. దీనిపై సైబర్ క్రైమ్ తో పాటు ఎన్నికల కమిషన్ కి పిర్యాదు చేస్తామని తెలిపారు. పోలీసులు అధికార పార్టీ కొమ్ముకాయకుండా ప్రజల కోసం పనిచేయాలని కోరుకుంటున్నానని రాణి రుద్రమ పేర్కొన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news