BREAKING : రాణి రుద్రమ-జిట్టా బాలకృష్ణరెడ్డి ఆస్తులు వేలం వేసిన రిలయన్స్

-

తెలంగాణ బీజేపీ నేతలు రాణి రుద్రమ – జిట్టా బాలకృష్ణ రెడ్డి లకు బిగ్‌ షాక్‌ తగిలింది. 18 కోట్ల రుణ ఎగవేతలో తెలంగాణ బీజేపీ నేతలు రాణి రుద్రమ – జిట్టా బాలకృష్ణ రెడ్డి ఆస్తులు వేలం వేసింది రిలయన్స్ సంస్థ. ఈ మేరకు పత్రికా ప్రకటన కూడా చేసింది.

బ్యాంకుల్లో భారీగా అప్పులు చేసి, ఆర్థిక నష్టాల్లోకి కూరుకుపోయి… చివరికి బీజేపీలో చేరారు జిట్టా బాలకృష్ణ రెడ్డి, రాణి రుద్రమ. ఈ మధ్య కాలంలోనే, బీజేపీ కండువా కప్పుకున్నారు జిట్టా బాలకృష్ణ రెడ్డి, రాణి రుద్రమ. ఈ ఇద్దరు కలిసి దందాలు చేసి రిలయన్స్ వద్ద భారీగా 18 కోట్లు పైగా లోన్ తీసుకున్నారు. అప్పు తిరిగి చెల్లించకపోవడంతో రిలయన్స్ సంస్థ అస్తుల వేలానికి నోటీసు ఇచ్చింది. లక్ష్మీ విలాస్ బ్యాంక్ దగ్గర లోన్ తీసుకోగా, రిలయన్స్ అస్సెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ సంస్థ వేలం వేస్తున్నది. ఇక దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news