రష్మిక ఆశ పడ్డా కాని బాలీవుడ్ వెనక్కి నెట్టింది..!!

-

పుష్ప సినిమా తర్వాత రష్మిక రేంజ్ మారి పోయిన విషయం తెలిసిందే. అక్కడి నుండి తాను దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించింది. దానితో బాలీవుడ్ సినిమాలు కోసం సంతకం చేసింది. అక్కడకు వెళ్లిన తర్వాత రష్మిక లో అహం పెరిగిందని వార్తలు వచ్చాయి.గతంలో కర్నాటక లో కాంతారా సినిమా విషయంలో రష్మిక మీద విపరీతమైన ట్రోల్స్ నడిచిన సంగతి తెలిసిందే.

ఇక ఆమె సినిమాలను బ్యాన్ చేయాల్సిందిగా టాక్ నడిచింది. రిషిబ్ శెట్టి తీసిన కాంతారా సినిమాని అందరూ పొగుడుతున్నా కాని, కన్నడ హీరోయిన్ అయ్యి ఉండి కూడా ఇప్పటివరకు సినిమా చూడలేదని తాపీగా చెప్పడంతో కన్నడ ప్రజలు మండి పడ్డారు.అదీ కాక ఫేమ్ వచ్చిన తర్వాత కన్నడ సినిమా వైపు చూడటం లేదని ఆమె పై కోపంతో రగిలి పోయారు.

రీసెంట్ గా ఆమె  సౌత్ ఇండియా మరియు బాలీవుడ్ మధ్య కంపేర్ చేసి సాంగ్స్ విషయం లో సౌత్ కు టేస్ట్ లేదని సౌత్ ను తక్కువ చేసేలా మాట్లాడింది. ఇంత పొగిడిన రష్మిక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా మారాలనే ఆశలు ఆవిరి అయినట్లు తెలుస్తోంది.మొదటి సినిమా అమితాబ్ తో చేసిన గుడ్ బై ప్లాప్ అయ్యింది.ఇక రెండో సినిమా మిషన్ మజ్ను సినిమా కూడా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. కాని ఈ సినిమా ను థియేటర్స్ లో కాకుండా డైరెక్ట్ ఓటీటీ కి రిలీజ్ చేస్తున్నారు.దీనితో రష్మిక బాలీవుడ్  స్టార్ హీరోయిన్ ఆశలు ఆవిరి అయ్యాయని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news