తన అనారోగ్య కారణం పై క్లారిటీ ఇచ్చిన రష్మిక…..!!

-

వెంకీ కుడుములు దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ సాధించిన ఛలో సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కన్నడ భామ రష్మిక మందన్న. కాగా తొలి సినిమానే మంచి సక్సెస్ సాధించడంతో పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి పేరు దక్కించుకుంది రష్మిక. ఇక ఆ తరువాత రౌడీ హీరో విజయ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన గీత గోవిందం సినిమాలో నటించిన రష్మిక , ఆ సినిమా ద్వారా కూడా మరొక సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుంది. కాగా ఆ సినిమాతో రష్మికకు యువతలో మంచి క్రేజ్ ఏర్పడింది.

అనంతరం టాలీవుడ్ లో రష్మిక కు అవకాశాలు వరుసగా క్యూ కట్టాయి. ఇక ప్రస్తుతం ఆమె సూపర్ స్టార్ మహేష్ సరసన సరిలేరు నీకెవ్వరు, నితిన్ హీరోగా తెరకెక్కుతున్న బీష్మ, అలానే అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త సినిమాల్లో ఆమె హీరోయిన్ గా నటిస్తోంది. ఇక వరుసగా సినిమాల షూటింగ్స్ తో రెండు నెలలుగా బిజీ బిజీగా గడుపుతూ ఉండడంతో ఆమెకు ఇటీవల కొన్నాళ్లుగా ఆరోగ్య రీత్యా కొన్ని సమయాలు వచ్చాయని, దానికి కారణం కేవలం తీరిక లేని షెడ్యూల్స్ అని మొన్న ఒక ఇంటర్వ్యూ లో భాగంగా రష్మిక చెప్పడం జరిగింది.

 

నిజానికి ఆ సమయంలో తాను తీవ్ర అనారోగ్యం బారిన పడ్డట్లు కొన్ని మీడియా మాధ్యమాల్లో వార్తలు వచ్చాయని, అయితే అటువంటిది ఏమి లేదని రష్మిక స్పష్టం చేసింది. 2020వ సంవత్సరం తనకు ఎంతో ప్రత్యేకం అని, ఆ ఏడాది విడుదల కాబోయే సినిమాలు మంచి విజయాలు సాధించి కెరీర్ పరంగా తనకు మంచి గుర్తింపుని తీసుకొస్తాయనే నమ్మకం తమకు ఉందని రష్మిక అంటోంది. మరి ఆ సినిమాల ద్వారా ఆమెకు ఎంత మేర విజయాలు లభిస్తాయో చూడాలి……!!

Read more RELATED
Recommended to you

Latest news