తనపై వస్తున్న ట్రోలింగ్ పై స్పందించిన రష్మిక..!

-

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీని సొంతం చేసుకుంది. చేసింది కొన్ని సినిమాలే అయినా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ పుష్ప సినిమాతో ఒక్కసారిగా నేషనల్ హీరోయిన్ గా మారిపోయింది. మరొకవైపు నార్త్ లో కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం రష్మిక ఎంత పాపులారిటీ అయితే సొంతం చేసుకుందో అంతే స్థాయిలో కాంట్రవర్సీలను సైతం ఎదుర్కొంటోంది. ఇటీవల రష్మికపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ ట్రోలింగ్ ఎంతలా అంటే ఆమె వ్యక్తిత్వాన్ని కూడా దెబ్బతీసే అంతగా ట్రోలింగ్ జరుగుతూ ఉండడం గమనార్హం.

నిజానికి రష్మిక చేసిన కొన్ని కామెంట్స్ పై నెట్టింట కొంతమంది నెగటివ్ గా కామెంట్లు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. దీంతో తనపై వస్తున్న ట్రోలింగ్ పై రష్మిక స్పందించింది. తాజాగా బాలీవుడ్ లో రష్మిక నటించిన చిత్రం మిషన్ మజ్ను. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి మరొకసారి హాట్ టాపిక్ గా మారింది ఈ ముద్దుగుమ్మ.

మీడియాతో మాట్లాడుతూ..” నటీనటులుగా ప్రేక్షకులు అందరూ మమ్మల్ని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉండాలనుకోకూడదని నాకు తెలిసొచ్చింది.. ఎంటర్టైన్మెంట్ రంగంలో ఉండడం వల్ల అందరి దృష్టి మనపైనే ఉంటుంది.. అలా అని అందరికీ నేను నచ్చుతానని అనుకోను.. ముఖ్యంగా నా విషయానికి వస్తే నేను మాట్లాడే విధానం.. వ్యవహార శైలి .. హావ భావాలు వాళ్ళకి నచ్చకపోవచ్చు. అందుకే నా గురించి కామెంట్స్ చేస్తున్నారు అని అనుకుంటాను.. నెగిటివిటీ గురించి పక్కన పెడితే ఎంతోమంది అభిమానుల ప్రేమను పొందుతున్నానని.. అందుకు వాళ్లందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటానని” రష్మిక చెప్పుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news