ఏపీ కరోనా బులిటెన్.. నేడు 2,367 కేసులు.. మరణాలు ఎన్నంటే..!

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు ఉదృతి కొనసాగుతూనే ఉంది. అయితే గతంతో పోలిస్తే ప్రస్తుతం కరోనా వైరస్ కేసుల సంఖ్య అతి తక్కువ ఉండటం ప్రజలందరిలో కాస్త ఊరట కలిగిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో సమర్థవంతంగా కరోనా వైరస్కు నియంత్రణ చర్యలు చేపడుతున్న తరుణంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుంది. ఇటీవలే గత ఇరవై నాలుగు గంటలకు సంబంధించిన కరోనా బులిటెన్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.

గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 2367 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.. ఇక ఈ కేసులతో మొత్తంగా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య ఎనిమిది లక్షల 40 వేల 730 కి చేరింది. కాగా ప్రస్తుతం 21,434 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో కరోనా వైరస్ బారినపడి 11 మంది చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 6779 చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news