కస్టమర్లకు గుడ్ న్యూస్… రిలయన్స్ డిజిటల్ ఇండియా సేల్ లో ఎలక్ట్రానిక్ వస్తువుల పై భారీ డిస్కౌంట్ లు….!

-

రాబోయే గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రిలయన్స్ “డిజిటల్ ఇండియా సేల్” తో కస్టమర్ల ముందుకు వచ్చింది. డిజిటల్ ఇండియా సేల్ ద్వారా ఎలక్ట్రానిక్ వస్తువులను భారీ డిస్కౌంట్ లకు పొందవచ్చు. ఈ సేల్ ను రిలయన్స్ డిజిటల్ స్టోర్లు, జియో స్టోర్లు మరియు అధికారిక రిలయన్స్ డిజిటల్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటుంది. ఈ సెల్ లో రిలయన్స్ డిజిటల్ ఏదైనా బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పై ఆరు శాతం తగ్గింపు పొందవచ్చు. అదేవిధంగా సిటీ బ్యాంక్ కస్టమర్లు క్రెడిట్ కార్డు మరియు డెబిట్ కార్డు అదేవిధంగా ఈఎమ్ఐ లావాదేవీలపై 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు.

మరియు ప్రతి ఐదు వేల కొనుగోలుపై విలువైన రిలయన్స్ డిజిటల్ గిఫ్ట్ వోచర్స్ కూడా పొందవచ్చు. ఈ ఆఫర్ జనవరి 26 నుండి అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ లో ల్యాప్ టాప్ లి, టీవీలు స్మార్ట్ ఫోన్ లు, వాషింగ్ మిషన్ లు ఇతర గృహోపకరణాలు ఉన్నాయి. డిజిటల్ ఇండియా సేల్ ద్వారా వన్ ప్లస్ 9RT 5G ఫోన్ ను రూ.38,999 లకు క్యాష్ బ్యాక్ తో పొందవచ్చు. వివో, శాంసంగ్ , రెడ్ మి ఫోన్ లపై కూడా భారీ డిస్కౌంట్ లు ఉన్నాయి.

RelianceDigital India Sale January 2022

 

వైర్ లెస్ చార్జింగ్ కేస్ తో యాపిల్ ఎయిర్ పాడ్ ను రూ.11,990 లకు పొందవచ్చు. సామ్ సంగ్ వాచ్ 3 బ్లూటూత్ ను కేవలం రూ.14,100 కు పొందవచ్చు. హెచ్ పీ గేమింగ్ లాప్ టాప్ లపై కూడా భారీ డిస్కౌంట్ లు ఉన్నాయి. అంతేకాకుండా రిలయన్స్ డిజిటల్ అధికారిక వెబ్సైట్ ద్వారా ఏ వస్తువును ఆర్డర్ చేసినా కేవలం మూడు గంటల లోపు డెలివరీ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. అయితే ఈ ఆఫర్ లు మరియు ధరలపై షరతులు వర్తిస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news