బీజేపీ గూటికి కేశినేని నాని… చంద్రబాబు ఫోటోలు పీకేసిన నాని ?

-

విజయవాడ రాజకీయాలు మరోసారి వెడేక్కాయి. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని చెప్పిన విజయ వాడ ఎంపీ కేశినేని నాని మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే భారతీయ జనతా పార్టీ లో చేరేందుకు మార్గం సుగమం చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఇందులో భాగంగానే… కేశినేని భవన్‌ లో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర బాబు నాయుడు ఫొటోలను తొలగించారు ఆయన సిబ్బంది.

కేశినేని భవన్‌ లో చంద్రబాబు నాయుడు తో పాటు తెలుగు దేశం పార్టీ నేతల ఫ్లెక్సీలను కూడా తొలగించారు నేతలు. గ్రౌండ్‌ ఫ్లోర్‌ మరియు ఆఫీసు లోపల ఉన్న పార్టీ నేతల ఫ్లెక్సీలు తొలగించారు. చంద్రబాబు మరియు ఇతర నేతల ఫొటోల స్థానం లో రతన్‌ టాటా ఫోటోలు పెట్టింది కేశినేని సిబ్బంది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు ఇప్పటికే ప్రకటించిన కేశినేని నాని… ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఫోటోలు తీసేయడంపై అందరిలోనూ గందర గోళ పరిస్థితి నెలకొంది. త్వరలోనే బీజేపీ లో ఆయన చేరుతారని సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news