పవన్‌ కళ్యాణ్‌ కు షాక్.. రేణూ దేశాయ్‌, కొడుకు అకీరాకు కరోనా పాజిటివ్‌

-

టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటికే చాలా మంది సినీ తారలు కరోనా బారీన పడ్డారు. ఇలాంటి తరుణంలో… పవన్‌ కళ్యాణ్‌ ఇంట కరోనా కల్లోలం సృష్టించింది. పవన్‌ కళ్యాణ్‌ మాజీ భార్య రేణూ దేశాయ్‌, ఆయన కొడుకు అకీరాకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది.

ప్రస్తుతం వారిద్దరూ హోం ఐసోలేషన్‌ లో ఉన్నారు. ఇక ఈ విషయాన్ని స్వయంగా పవన్‌ కళ్యాణ్‌ మాజీ భార్య రేణూ దేశాయ్‌.. తన సోషల్‌ మీడియా వేదికగా ప్రకటన చేసింది. “నాకు, అఖీరా నందన్ లకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. థర్డ్ వేవ్ ను సీరియస్ గా తీసుకుని మాస్కులు ధరించండి. జాగ్రత్తగా ఉండండి” అంటూ రేణూ దేశాయ్ పోస్ట్ చేసింది.కాగా ఇప్పటికే చిత్ర పరిశ్రమలో మహేష్ బాబు, రాజేంద్ర ప్రసాద్, మంచు లక్ష్మి, హీరోయిన్ త్రిష, మంచు మనోజ్, బండ్ల గణేష్ లాంటి తదితరులు కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే.

 

https://www.instagram.com/renuudesai/p/CYk-ceTB5zj/?utm_medium=share_sheet

Read more RELATED
Recommended to you

Latest news