తోడు కావాలంటూ.. రేణూ దేశాయ్ పోస్ట్ వైరల్..!

-

ప్రముఖ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రేణూ దేశాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వివాహం చేసుకున్న తర్వాత ఈమె క్రేజ్ మరింత పెరిగిపోయిందని చెప్పవచ్చు. అయితే అఖీరానందన్ , ఆద్య జన్మించిన తర్వాత 2013లో వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక పిల్లల కోసం తల్లిదండ్రులుగా కొనసాగుతోంది ఈ జంట . ఇదిలా ఉండగా అప్పట్లో పలు ఇంటర్వ్యూలలో తోడు అవసరం అని రేణు దేశాయ్ తెలిపిన విషయం తెలిసిందే. ఇకపోతే రెండో పెళ్లి చేసుకోబోతోంది అంటూ వార్తలు కూడా వచ్చాయి. అంతేకాదు 2018 లో ఒక వ్యక్తిని ఇష్టపడిందని, అతడితో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంటుంది అంటూ వార్తలు వినిపించాయి. అయితే ఇప్పటివరకు ఆ వార్తలకు ఎలాంటి ఆధారాలు లభించలేదు.ఇప్పుడు మరొకసారి రేణు దేశాయ్ రెండో పెళ్లి వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతూ ఉండడం గమనార్హం.. తాజాగా రేణు దేశాయ్ తన ఇంస్టాగ్రామ్ లో.. జీవితంలో అవసరం ఉన్నప్పుడు మన చేయి పట్టుకుని నడిపించే ఒక తోడు కావాలి.. అంటూ ఒక సరస్సు ఒడ్డున కూర్చొని ఉన్న వీడియో పోస్ట్ చేసింది. ఇక మరొక పోస్టులో.. మీ సోల్మేట్ ని వెతకడానికి ముందు మిమ్మల్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోండి.. అంటూ కామెంట్ చేసింది. రేణు దేశాయ్ చాలా రోజుల తర్వాత ఇలాంటి పోస్ట్లు పెట్టడంతో మరోసారి రెండో పెళ్లి వార్త అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి . మరి రేణు దేశాయ్ నిజంగానే రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశంలో ఉందా అనే అనుమానాలు కూడా నెటిజన్ లలో వ్యక్తం అవుతూ ఉండడం గమనార్హం.

ఇక రేణు దేశాయ్ మంచి వ్యక్తిత్వం ఉన్నవారు. ఇక భర్త తోడు లేకపోయినా పిల్లల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఇప్పటికీ ఒంటరిగానే పిల్లల భవిష్యత్తు కోసం తాపత్రయపడే ఈమె అంటే చాలామందికి సమాజంలో గౌరవం కూడా.. అనవసరమైన విషయాల్లో ఎప్పుడూ తలదూర్చకుండా తన పని తాను చేసుకుంటూ చాలా ఉన్నతంగా జీవిస్తోంది అని చెప్పవచ్చు.

 

View this post on Instagram

 

A post shared by renu desai (@renuudesai)

Read more RELATED
Recommended to you

Latest news