Telangana : శాసనసభలో గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానంపై చర్చ

-

గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయసభల్లో చర్చ ప్రారంభమైంది. శాసనసభ, శాసనమండలిలో ఇవాళ ప్రశ్నోత్తలను రద్దు చేశారు. దీంతో నేరుగా చర్చ చేపట్టారు. రెండు సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నిన్న చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం ప్రవేశపెట్టారు.

అసెంబ్లీలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తీర్మానాన్ని ప్రతిపాదించగా.. మరో శాసనసభ్యుడు వివేకానందగౌడ్ బలపరిచారు. శాసనమండలిలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తీర్మానాన్ని ప్రతిపాదించగా… మరో ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ బలపరిచారు.

శాసనసభలో గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సభలో మాట్లాడుతున్నారు. ‘తెలంగాణ అభివృద్ధి దేశానికి ఆదర్శంగా మారింది. తెలంగాణ ఆచరిస్తున్న ప్రతి పథకాన్ని… దేశం అనుసరిస్తోంది.’ అని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news