నీ ఒంట్లో తెలంగాణ రక్తమే ఉంటే చర్చకు రా..కేటీఆర్ కు రేవంత్‌ సవాల్‌

-

వ్యవసాయ రంగంపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని.. మరీ దీనిపై కేటీఆర్‌ సిద్ధమా అని ఫైర్‌ అయ్యారు రేవంత్‌ రెడ్డి. కేటీఆర్ ఒంట్లో… తెలంగాణ రక్తమే ఉంటే తనతో చర్చకు రావాలని సవాల్‌ విసిరారు రేవంత్‌ రెడ్డి. 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ ఏం చేసిందో చర్చ కు మేము సిద్దమని… 2014 నుండి 2022 వరకు కేసీఆర్ ఏం చేశారో చర్చ చేద్దామని పేర్కొన్నారు. ఏబుల్ లీడర్ షిప్ అని కేటీఆర్ చెప్పుకుంటున్నారు… మేము రైతు బజార్ లు తెరిస్తే… కెసిఆర్ ఊరూరూ లిక్కర్ షాప్ లు తెరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్‌ రెడ్డి.

ఏడున్నర ఏండ్లలో పేదల నుండి 1 లక్ష 50 వేల కోట్లు దొచాడని ఫైర్ అయ్యారు. రైతు బందు పేరుతో మీరు ఇచ్చింది 50 వేల కోట్లు అని… తులసి వనం లెక్క ఉన్న తెలంగాణను గంజాయి వనం లెక్క మార్చేశారని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు. ఎక్కడ చూసినా గంజాయి కనిపిస్తుందని… కెసిఆర్ ఫార్మ్ హౌస్ లో ఎకరం కి కోటి రూపాయలు వస్తుంది అని చెప్పాడని మండిపడ్డారు. కెసిఆర్ ఫార్మ్ హౌస్ లో గంజాయి ఏమైనా పండిస్తున్నడా..? అని నిలదీశారు. లాభ సాటి వ్యవసాయం చేస్తే.. కెసిఆర్ రైతుల్ని ఫార్మ్ కి తీసుకెళ్ళి అవగాహన కల్పించాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news