విశాఖ ఉక్కుకు కేటీఆర్ మ‌ద్దతు వెనుక దురుద్దేశం.. రేవంత్ సంచలనం !

-

మంత్రి కేటీఆర్ కు ఎంపీ రేవంత్ రెడ్డి లేఖ రాశారు. విశాఖ ఉక్కు పోరాటానికి మీరు మద్దతు తెలపడం వరకు దురుద్దేశం ఉందని లేఖలో పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధి కోసమే ఈ ఎత్తుగడ వేశారని రేవంత్ రెడ్డి విమర్శించారు. విభజన చట్టంలో తెలంగాణకు రావాల్సిన వాటిపై పోరాడారు కానీ విశాఖ ఉక్కు కోసం పోరాడుతారా అని లేఖలో రేవంత్ రెడ్డి ప్రశ్నించారు..

పెరిగిన గ్యాస్, పెట్రోల్ ధరలపై పోరాడేందుకు మొహం చాటేశారు అని అన్నారు.  అసలు మీ ఎంపీలు పార్లమెంట్ కి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోడీ అంటే భయపడుతున్నారా..? లేక రాజీ పడుతున్నారా..? అంటూ రేవంత్ లేఖలో నిలదీశారు. బీజేపీపై గల్లీలో మీ మాటలకు, ఢిల్లీలో చేతలకు అసలు పొంతన కుదరడం లేదని లేఖలో పేర్కొన్న రేవంత్ మీరు జంతర్ మంతర్ దగ్గర దీక్షకు వస్తారా రారా… స్పష్టం చేయాలని లేఖలో డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news