ఆ 20 మంది BRS MLA ల గురించి జగ్గారెడ్డి ని అడగండి: రేవంత్ రెడ్డి

-

ఈనెల 13వ తేదీన ఎమ్మెల్యేలను కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకి తీసుకువెళ్తామని రేవంత్ రెడ్డి అన్నారు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కూడా తీసుకెళ్తామని ఈ టూర్ కి ప్రతిపక్ష నేత కేసీఆర్ అని ఆహ్వానిస్తున్నామని చెప్పారు. విలేకరులతో రేవంత్ రెడ్డి శనివారం మాట్లాడుతూ మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ల కొంగుబాటు మీద విజిలెన్స్ విచారణ జరుగుతుందని దోషులు ఎవరో త్వరలోనే తేలిపోతుందని అన్నారు.

నీటిపారుతుల శాఖపై అసెంబ్లీలో శ్వేత పత్రం విడుదల చేస్తామని అన్నారు. 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తారని జగ్గారెడ్డి అంటున్నారని మరి ఇతర పార్టీ ఎమ్మెల్యేల చేరిక గురించి ఆయననే అడగాలని అన్నారు. మా పాలన నచ్చి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ముందుకు వస్తే కలుపుకొని పోతామని అన్నారు. అసెంబ్లీలో తాను తెలంగాణ భాషనే మాట్లాడుతున్నానని అన్నారు. రెండు లక్షల రుణమాఫీ గురించి బ్యాంకులతో చర్చిస్తున్నామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news