రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం హ్యాండ్ ఇస్తోంది : హరీశ్ రావు

-

తెలంగాణ మాజీ మంత్రి హరీశ్ రావు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడారు. తెలంగాణ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టాడు. మొత్తం 19,746 కోట్లు అన్నాడు. ఇందులో జీతాలకు 03 కోట్లు పోతుంది. మిగిలింది 16వేల కోట్లు మాత్రమే.. 16వేల కోట్లకు వచ్చే సరికి కోటి 50లక్షల భూమి ఉంది. 22,500 కోట్లు రైతు భరోసాకే కావాలి. డిసెంబర్ 09వతేదీనే రుణమాఫీ చేస్తామని నమ్మించారు. రెండు నెలలు గడిచినా రుణమాపీ చేయలేదన్నారు. ఆరు గ్యారెంటీల అమలు పై స్పష్ట ఇవ్వలేదన్నారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం హ్యాండ్ ఇస్తుందన్నారు. 

బోనస్ ను భోగస్ చేసింది. రుణమాఫీకి బడ్జెట్ లో నిధులను కేటాయించలేదు. 82వేల కోట్ల అవసరం అయితే.. 16వేల కోట్లకే బడ్జెట్ పెట్టిందన్నారు. రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చక మోసపోతున్నారని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో అబద్దాలు చెప్పారు. అసెంబ్లీలో కూడా అబద్దాలే చెప్పారు. 24 గంటల కరెంట్ ఇస్తున్నారని చెప్పారు. రైతులు ఆగ్రహానికి గురికాక తప్పదు అన్నారు. కొండంత ఆశ చూపించి గోరంత కూడా కేటాయించని బడ్జెట్ ఇది అని హరీశ్ రావు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news