కేసీఆర్ మేడిగడ్డకు రావాలి.. కావాలంటే డేట్ మారుస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

-

కేసీఆర్ మేడిగడ్డకు రావాలి.. కావాలంటే డేట్ మారుస్తామని తెలంగాణ  సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఏడాది అంతా అబద్దం చెప్పడం ఎందుకు అని.. మొదటి రోజే నిజం చెబుతున్నాం. ఈనెల 13న మేడిగడ్డకు వెళ్లాలని నిర్ణయించాం. ప్రతిపక్ష నేత కేసీఆర్.. బీఆర్ఎస్ నాయకులు ఈనెల 13న రావాలని ఆహ్వానిస్తున్నాం. అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్స్ ని తీసుకెళ్లుతున్నాం.. బీఆర్ఎస్ నేతలు కూడా రావాలన్నారు.

ఒకవేళ బీఆర్ఎస్ నేత కేసీఆర్ రాలేకపోతే డేట్ మార్చడానికి కూడా సిద్ధమేనని స్పష్టం చేశారు. ఈ-పార్ములా రేస్ పై నోటీస్ ఇచ్చామని తెలిపారు. రుణమాఫీ పై బ్యాంకులో చర్చిస్తున్నామని మీడియాతో చిట్ చాట్ లో తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. నీటి పారుదల శాఖపై శ్వేత పత్రం విడుదల చేస్తామన్నారు. దీనిపై రూ.16వేల కోట్ల అప్పులు చెల్లించాల్సి ఉంది. అనవసరమైన టెండర్లు రద్దు చేస్తాం.  మరోవైపు  వ్యవసాయం చేసే భూములకే రైతు భరోసా ఇస్తామన్నారు. సాగులో ఉన్న భూములకు పెట్టుబడి సాయం అందిస్తామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news