కొడంగల్‌ నుంచే పోటీ చేస్తా: రేవంత్ రెడ్డి

-

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కొడంగల్ నియోజకవర్గం నుంచి తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని క్లారిటీ ఇచ్చారు. అయితే తెలంగాణ రాష్ట్రంలోని చాలా చోట్ల నుంచి పోటీ చేయాలని కోరుతున్నారని తెలిపారు.

కానీ తాను అధిష్టానం నిర్ణయం మేరకు కొడంగల్ నుంచి మాత్రమే పోటీ చేస్తానని వివరించారు రేవంత్ రెడ్డి.కాగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మంగళవారం రోజున టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పర్యటించారు. హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా భూపాలపల్లిలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభ వద్దకు స్థానిక బీఆర్ఎస్ నాయకులు వెళ్ళేందుకు ప్రయత్నించగా ఉద్రిక్తత చోటు చేసుకుంది.

కాశీంపల్లి గ్రామం నుంచి పాదయాత్ర చేసిన రేవంత్‌రెడ్డి… భూపాలపల్లి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతున్న క్రమంలో స్థానిక బీఆర్​ఎస్ కార్యకర్తలు సుమారు వందమంది సభ వద్దకు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news