గుమ్మడికాయల దొంగ… అంటే భుజాలు తడుముకోవడం ఎందుకు..? రేవంత్

-

తెరాస నేతలు గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు ఎందుకు తడుముకుంటున్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇద్దరు తెరాస ఎంపీలు కాంగ్రెస్ తో చేరతారని చెప్పగానే విశ్వేశ్వ రెడ్డి, సీతారాంనాయక్ ప్రగతి భవన్ కి ఎందుకు పిలిపించుకుని వివరణ అడిగారని ఆయన తెరాన అధినేతను ప్రశ్నించారు. గురువారం తానన్న మాటలకు కట్టుబడి ఉన్నానని మరో సారి చెప్పారు.

సీఎం అధికారిక నివాసమైన ప్రగతి భవన్‌ వేదికగా రాజకీయాలు చర్చించారని.. ఇది ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కిందికి వస్తుందని ఆరోపించారు. అందుకే దీనిపైనా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.  ‘డిసెంబర్‌ 7వ తేదీ నాటికి రెండు వికెట్లు కచ్చితంగా పడతాయి ధీమా వ్యక్తం చేశారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా అదే కోవలో ఉన్నారు’ అని రేవంత్ అన్నారు. విశ్వేశ్వర్‌ రెడ్డి తాండూరులో మహేందర్‌ రెడ్డి తరఫున ఎందుకు ప్రచారం చేయడంలేదని నిలదీశారు. తెలంగాణ మహాకూటమి ప్రభంజనం ఖాయమన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news