సునామీ సృష్టిస్తాం.. ఉప్పెనలా కేసీఆర్‌ను ఫాంహౌస్‌ను కప్పెస్తా : రేవంత్

-

యాసంగి పంటలను కొనకపోతే వేలాది మంది రైతులతో.. ఉప్పెనేలా వచ్చి..కేసీఆర్‌ ఫామ్ హౌస్ ను కప్పేస్తానని రేవంత్ రెడ్డి వార్నింగ్‌ ఇచ్చారు. నిన్న జరిగగిన ఎల్లారెడ్డి సభలో రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ… ఎల్లారెడ్డి గడ్డ మీద మరోసారి కాంగ్రెస్ గెలిస్తుందని..సదాలక్ష్మి, ఈశ్వరీ బాయి, బాల గౌడ్ లు చాలా మంది ఈ ప్రాంతం నుంచి ప్రాతినిథ్యం వహించారన్నారు. గెలుపు ఓటములు సహజం.. దళితుడైనా గంగారాం.. పార్టీ కోసం 40 ఏళ్ళు పార్టీకి సేవ చేసాడన్నారు.

సురేందర్ ను మీరు గెలిపిస్తే నల్లికోట్లోడు మిమ్మల్ని మోసం చేసిపోయాడని… ఒక్కడు మిమ్మల్ని మోసం చేసి పోతే లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఇక్కడ ఉన్నారని పేర్కొన్నారు. కల్లాలో కాంగ్రెస్ కార్యక్రమం భాగంగా ఇక్కడే తిరిగాం.. వరి పండించిన రైతులను మోసం చేస్తే ఎల్లారెడ్డి నడి బజార్లో ఉరి తీస్తామని అపుడే చెప్పానని గుర్తు చేశారు.ఇక్కడ రైతులను చూస్తే పంజాబ్, హర్యానా రైతుల్లాగా పోరాట స్ఫూర్తి ఉందని… మూడు నల్ల వ్యవసాయ చట్టాలు తెస్తే పంజాబ్ రైతులు పోరాటం చేసి ఆ చట్టాలను బొంద పెట్టారని పేర్కొన్నారు.

కేసీఆర్ ముద్దుల కూతురు కవిత ఇక్కడ ఎంపీ గా పోటీ చేసిన సమయంలో వంద రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తా అన్నది.. కానీ 1500 రోజులు అయిన తెరవకపోతే ఆమెను ఎలా ఓడించారో అది తనకు తెలుసు.. మీ స్ఫూర్తి అలాంటిదన్నారు. బండి పార్టీ గుండు కూడా ఇలాగే పసుపు బోర్డ్ తెస్తా అన్నాడు అడ్రెస్ లేదు.. ఆయన మోసం చేసాడని నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Latest news