నేడు రామోజీరావును కలవనున్న రేవంత్ రెడ్డి

-

కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ పేరును ప్రకటించడంతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాలు మారిపోయాయి. ఇక అటు ప్రకటన రావడంతో రేవంత్ రెడ్డి తనదైన దూకుడును ప్రదర్శిస్తున్నాడు. వరుస ప్రెస్ మీట్ లతో కెసిఆర్ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నాడు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకులను, ఇతర కార్యకర్తలను కలుపుకుని ముందుకు సాగుతున్నారు రేవంత్. అలాగే టీవీ ఛానల్స్ అధినేతలను మచ్చిక చేసుకుంటున్నారు రేవంత్ రెడ్డి.

ఇందులో భాగంగానే ఇప్పటికే టీవీ5, మరియు ఆంధ్రజ్యోతి అధినేతలను రేవంత్ రెడ్డి కలిశారు. అయితే తాజాగా ప్రముఖ మీడియా సంస్థ అధినేత రామోజీ రావు గారిని ఇవాళ రేవంత్ రెడ్డి కలవబోతున్నారు.

రాజకీయ సమీకరణాలు మారుతున్న తరుణంలో రామోజీ రావును రేవంత్ రెడ్డి కలవడం పెద్ద చర్చకు దారితీస్తోంది. ఇక నిన్న బెంగుళూర్ వెళ్ళిన రేవంత్ రెడ్డి.. అక్కడి కాంగ్రెస్ నేతలను కలిశారు. ఇవాళ బెంగుళూర్ నుంచి హైదరాబాద్ వస్తున్న రేవంత్.. రామోజీ రావు ఇంటికి వెళ్లనున్నారు. కాగా రేపు రేవంత్ రెడ్డి పిసిసి పదవీ బాధ్యతలను చేపట్టనున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news