కెసిఆర్ పై బిజేపి మాజీ ఎంపీ ఫైర్.. నీ అబ్బా జాగీరా

-

తెలంగాణ సిఎం కెసిఆర్ పై మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఉద్యమకారున్ని ముఖ్యమంత్రిని చేయడం మన మొదటి తప్పు అని…తెలంగాణ కుటుంబాలను బాగు చేయడం పక్కన పెట్టి.. కేసీఆర్.. తన కుటుంబాన్ని బాగు చేసుకుంటున్నాడని ఎవరికీ తెలియదన్నారు. మొదటి అపెక్స్ మీటింగ్ లో నేను ఉన్ననని చెప్పిన జితేందర్ రెడ్డి.. 811 టిఎంసీలను విభజించినప్పుడు 299 టిఎంసీలకు కేసీఆర్ ఒప్పుకున్నాడని.. 550 టిఎంసీల నీళ్ళు తెలంగాణకు రావాల్సి ఉందని పేర్కొన్నారు.

నీ అబ్బా జాగీరుగా తెలంగాణ వాటా 299 టిఎంసీలకు ఒప్పుకుంటావా? అని నిలదీశారు. 808 టిఎంసీల దగ్గర నీటిని తీసుకోవాల్సిన ఆంధ్ర వాళ్ళు… 824 టిఎంసీలకు తీసుకుపోతుంటే ఇంటికి పిలిచి మటన్ తో భోజనం పెట్టడాని మండిపడ్డారు.

ఏపీలో టెండర్లు అయిపోయాక కేసీఆర్ కేంద్రానికి లేఖ రాసాడని… నీళ్ల గొడవలపై ఒక్కరోజైనా ఢిల్లీలో కూర్చొని మాట్లాడావా? అని ఫైర్ అయ్యారు. పోతిరెడ్డిపాడును ఆపేలా కేంద్రం మీద ఒత్తిడి తెస్తామని…రెండు వారాల్లో cisf పోలీసులు అన్ని ప్రాజెక్టుల వద్ద మోహరింపు చేస్తారన్నారు. మాకు కొన్ని సంకేతాలు కేంద్రం నుంచి వచ్చాయని.. కేంద్రం నీటి సమస్యలపై ఒక నిర్ణయం తీసుకోబోతుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news