కేసీఆర్‌ మాటల వెనుక ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ : రేవంత్‌ సంచలనం

-

కేసీఆర్‌ కొత్త రాజ్యాంగం అన్న మాటలపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కెసిఆర్ మాటల వెనక కుట్ర ఉందని.. మోడీ ఆదర్శ నాయకుడు పుతిన్ అని.. కెసిఆర్ కి ఆదర్శం ఉత్తర కొరియా అధ్యక్షుడు కింగ్ జన్ ఉన్ అంటూ పేర్కొన్నారు. ఇద్దరి ఆలోచన నియంత పోకడ..రాచరిక పెత్తనమని.. ఇలాంటి ఆలోచనలు తిప్పి కొట్టాలని పిలుపు నిచ్చారు. ఇవాళ అన్ని పోలీస్ స్టేషన్ లలో కెసిఆర్ పై ఫిర్యాదు లు చేస్తామని.. రేపు అంబేద్కర్ విగ్రహాల పాలాభిషేకం కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.

అంబేద్కర్ పాలాభిషేకం కి మహిళా నాయకులే చేయాలని.. సోమవారం..పార్లమెంట్ లో దీక్ష చేస్తామని ప్రకటన చేశారు. రాహుల్..సోనియా గాంధీ తో మాట్లాడతామని.. భవిష్యత్ కార్యాచరణ pac లో చర్చ చేస్తామన్నారు. 8 ఏండ్లు ఎన్ని అరాచకాలు చేసినా కెసిఆర్ నీ రాళ్లతో కొట్టే వాళ్ళమని.. ఆటవిక రాజ్యం కావాలని అనుకుంటే… మొదట శిక్షించేది నిన్నేనని ఫైర్‌ అయ్యారు. రాజ్యాంగం మీద గౌరవం ఉంది కాబట్టే నిన్ను ఏం అనట్లేదని.. నీకు రాజ్యాంగం నచ్చకపోతే.. అడవిలోకి వెళ్లు అంటూ చురకలు అంటించారు.

Read more RELATED
Recommended to you

Latest news