ఏపీ రాజకీయనాయకులు కరాటే..బాక్సింగ్ నేర్చుకోవాలి : ఆర్జీవీ

-

ప్రస్తుతం ఏపీ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. పట్టాభి తో పాటు టిడిపి పార్టీ కార్యాలయంపై జరిగిన దాడులతో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడంతో పాటు దాడులకు దిగేలా సంచలన వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. యుద్దానికి మేము సై…అంటే మేము సై అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దాంతో భౌతిక దాడులు జరిగే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

అయితే తాజాగా రాజకీయాలపై ఎప్పుడూ తన స్టైల్ లో స్పందించే వర్మ ఏపీ లో నెలకొన్న రాజకీయ పరిణామాలపై కూడా స్పందించారు. త్వరలోనే ఏపీ రాజకీయ నాయకులు కరాటే, బాక్సింగ్… కర్ర సాము తదితర విద్యలను నేర్చుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాజకీయ నాయకుల విమర్శలు…ఆగ్రహం చూస్తుంటే వర్మ చేసిన కామెంట్లు నిజమేనని అనిపిస్తోంది. ఇదిలా ఉంటే రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం “కొండా” అనే టైటిల్ తో కొండా సురేఖ దంపతుల కథను సినిమా గా తెరకెక్కిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news