ఏ మూలన దాక్కున్నా.. వడ్డీతో చెల్లిస్తాం : వైసిపికి అచ్చెన్నా వార్నింగ్

-

తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదలం.. అధికారంలోకి రాగానే ఏ మూల దాక్కున్నా లాగి లాగి వడ్డీతో సహా చెల్లిస్తామని వార్నింగ్ ఇచ్చారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. తెలుగుదేశం కార్యకర్తలు పోలీసులకు భయపడేది లేదని.. సర్వేల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టమవటంతో వైసీపీ కౌంటర్ దీక్షలకు దిగుతోందన్నారు. రాష్ట్రంలో లభ్యమయ్యే నాసిరకం మద్యంలో మాదక ద్రవ్యాలు కలుపుతున్నారని.. రాష్ట్రానికి గంజాయి కొత్త కాదని డీజీపీ మాట్లాడటం దుర్మార్గమని మండిపడ్డారు.

ఏపీని డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా చేసేంత వరకు పోరాడతామన్నారు. పార్టీ కార్యాలయం అంటే దేవాలయం వంటిదని.. ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపితే పార్టీ కార్యాలయాలపై దాడులు చేస్తారా..? అని ప్రశ్నించారు. నేతల భాష విషయంలో జగన్ చర్చకు సిద్దమా..? ఎవరేం మాట్లాడారో ప్రజలకు తెలుసన్నారు. మత్తు పదార్థాల వల్ల యువత చెడిపోతున్నారని.. రాష్ట్రం మాదకద్రవ్యాల కేంద్రంగా మారుతోందనే ఆవేదనతో తెలుగుదేశం పోరాడుతుంటే దాడికి దిగుతున్నారన్నారు.

ప్రాణ త్యాగం చేసిన పోలీసుల ఆత్మలు ఈ డీజీపీ తీరుతో ఘోషిస్తాయని.. రెండున్నరేళ్లలో డీజీపీ పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించారని ఆగ్రహించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు పట్ల ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారని.. ముఖ్యమంత్రి, డీజీపీ కలిసి కుట్ర పన్ని తొలుత చంద్రబాబు నివాసం పైకి దాడికి యత్నించారన్నారు. తర్వాత పార్టీ కార్యాలయంపైనే దాడి చేశారని.. రెండున్నరేళ్లగా టీడీపీ నేతల ఆర్ధిక మూలాలని దెబ్బకొడుతూ అరాచకం సృష్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం ఇది.. దేశ చరిత్రలో ఎప్పుడూ ఈ రీతిలో జరగలేదని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news