BREAKING : సచివాలయంలో మంత్రి పేర్ని నానితో ఆర్జీవీ సమావేశం

-

కాసేపటి క్రితమే…ఏపీ సినిమాటో గ్రాఫీ మంత్రి పేర్ని నానితో టాలీవుడ్ సంచలన దర్శకుడు ఆర్జీవీ సమావేశం అయ్యారు. విజయవాడ ఎయిర్‌ పోర్టు నుంచి నేరుగా సచివాలయానికి చేరుకున్న ఆర్జీవీ… మంత్రి పేర్ని నానితో సమావేశం అయ్యారు. సినిమా టిక్కెట్ల ఎపిసోడ్, టాలీవుడ్ పరిశ్రమ సమస్యలపై ఈ సమావేశంలో మంత్రి పేర్ని-ఆర్జీవీ చర్చించనున్నారు.

సినిమా టికెట్ల అంశం పై ఆర్జీవీ వరుస ట్వీట్లు, మంత్రి పేర్ని నాని రియాక్షన్ ట్వీట్ల నేపధ్యంలో భేటీ పై ఆసక్తి పెరిగింది. తాను ఓ సినిమా పెద్దగా మంత్రి పేర్ని నాని వద్దకు రాలేదని… కానీ.. ఒక సినిమా కు చెందిన వ్యక్తిగానే ఏపీకి వచ్చానని చెప్పారు. మంత్రి పేర్ని నానితో మాట్లాడిన అనంతరమే… ఈ వివాదంపై మాట్లాడుతానని ఆర్జీవీ పేర్కొన్నారు. కాగా.. గత కొన్ని రోజుల నుంచి టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ, జగన్‌ సర్కార్‌ ల మధ్య సినిమా టికెట్ల వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. టికెట్ల ధరలను పెంచాలని చిత్ర పరిశ్రమ డిమాండ్‌ చేస్తూంటే.. జగన్‌ సర్కార్‌ మాత్రం తగ్గడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news