NCA ట్రైనింగ్ లో ఉన్న రిషబ్ పంత్, పృథ్వీ షా పిక్స్ వైరల్!

-

గత సంవత్సరం ఇండియా కీ ప్లేయర్ రిషబ్ పంత్ కు రోడ్ ఆక్సిడెంట్ అయ్యి గాయాల నుండి కోలుకుని ప్రస్తుతం బెంగుళూరు లో ఉన్న నేషనల్ క్రికెట్ అకాడమీ లో శిక్షణ తీసుకుంటూ ఉన్నాడు. ఇక అదే విధంగా ఇండియా క్రికెటర్ పృథ్వీ షా ఇంగ్లాండ్ లో కౌంటీలను ఆడడానికి వెళ్లగా, సడెన్ గా గాయంతో ఇతను కూడా NCA లో శిక్షణ పొందుతున్నాడు. కాగా ఈ రోజు వీరిద్దరూ కలిసిన ఫోటో ఒక్కటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా రానున్న నాలుగు నెలల్లో ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానుండగా ఇద్దరు క్రికెటర్లు ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్నారు. కాగా ఇప్పటి వరకు ఢిల్లీ క్యాపిటల్స్ లో ఐపీఎల్ లో ఒక్కసారి కూడా టైటిల్ సాధించకపోవడం చాలా బాధాకరం అని చెప్పాలి.

కానీ గత రెండు సీజన్ లుగా పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ ను చాలా బాగా మెరుగుపరిచాడు. ఈసారి టైటిల్ ను ఖచ్చితంగా సాధించాలన్న కసితోనే బరిలోకి దిగనున్నారు.. మరి పంత్ మరియు పృథ్వీ షా లు త్వరలోనే పూర్తి ఫిటినెస్ తో తిరిగి రావాలని ఆశిద్దాం.

Read more RELATED
Recommended to you

Latest news