ABUDHABI LEAGUE :దంచికొట్టిన జాసన్ రాయ్ 39 బంతుల్లో 84 !

-

దుబాయ్ లో నిన్నటి నుండి అబుదాబి టీ 10 లీగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ లీగ్ లో మొత్తం ఎనిమిది జట్లు టైటిల్ కోసం హోరాహోరీగా పోటీ పడనున్నాయి. ఇందులో భాగంగా ఈ రోజు కాసేపటి క్రితం నుండి జరుగుతున్న మ్యాచ్ లో టీం అబుదాబి మరియు చెన్నై బ్రావ్స్ మధ్యన మ్యాచ్ జరుగుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత ఓవర్ లలో 115 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది. దీనితో టీమ్ అబుదాబి ముందు 116 పరుగుల లక్ష్యం నిలిచింది. ఇక ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ కు చెందిన జాసన్ రాయ్ అబుదాబి బౌలర్లపై ఒక రేంజ్ లో విరుచుకుపడ్డాడు.. ఇతను కేవలం 39 బంతులు ఆడి ఆరు ఫోర్లు మరియు 7 సిక్సులు సహాయంతో 84 పరుగులు చేశాడు.

ఇంతలా రెచ్చిపోయిన జాసన్ రాయ్ ను ఇంగ్లాండ్ క్రికెట్ యాజమాన్యం ఒక కుర్రాడి కోసం జట్టులోకి తీసుకోకుండా నిలిపివేసింది. తద్వారా కనీసం సెమీస్ కు కూడా చేరకుండానే ఇంటిబాట పట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news