IND VS BAN : రిషబ్ పంత్ సెంచరీ.. భారీ స్కోరు దిశగా భారత్

-

చెపాక్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ ఇండియా యంగ్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్​ అయిన  శుభ్‌మన్ గిల్ రెండో ఇన్నింగ్స్‌లో నిలకడగా పరుగులు చేస్తున్నాడు. సెంచరీ  సాధించాడు. అలాగే పంత్ ఇప్పటికే సెంచరీ పూర్తి చేశారు. 109 పరుగులు చేసి ఔట్ అయ్యాడు రిషబ్ పంత్. దీంతో భారత్ భారీ స్కోరు దిశగా పరుగులు పెడుతోంది.  ప్రస్తుతం శుభ్‌మన్ గిల్, కే.ఎల్.రాహుల్ క్రీజులో ఉన్నారు.

తొలి ఇన్నింగ్స్ లో భారత్ 376 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో కేవలం 149 పరుగులకే కుప్పకూలిపోయింది. భారీ ఆధిక్యంలో భారత్ దూసుకెళ్తోంది. ప్రస్తుతం భారత్ 506 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఓపెనర్ యశస్వి జైస్వాల్ నిరాశ పరిచినప్పటికీ గిల్, పంత్ మాత్రం సెంచరీలతో భారీ స్కోరు చేసింది భారత్.

Read more RELATED
Recommended to you

Exit mobile version